గుంటూరు:
గుంటూరు లోని పట్టాభిపురం నుండి శ్యామల నగర్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్ ను హోంమంత్రి మేకతోటి సుచరిత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరిధర రావు, ఎమ్మెల్సీ లు కల్పలతా రెడ్డి, లక్ష్మణరావు, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఇతర వైస్సార్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సీసీ రోడ్డు కు ఇరువైపులా హోంమంత్రి సుచరిత గారు మొక్కలను నాటారు. నాయకులు, అధికారులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన సిసి రోడ్ ను హోంమంత్రి గారు పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో గుంటూరు నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని హోంమంత్రి సుచరిత తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నగరాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలో పెనుమార్పులు వచ్చాయన్నారు. తడి చెత్త, పొడి చెత్త, చెట్ల ను నాటడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత గారు పేర్కొన్నారు.
Thank You