పాకిస్తాన్‌లోని అతిపెద్ద మీడియా సంస్థ అధిపతిని అక్కడి ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేసింది...

పాకిస్తాన్‌లోని అతిపెద్ద మీడియా సంస్థ జంగ్ గ్రూప్ అధిపతి షకీలుర్ రెహమాన్‌ను పాకిస్తాన్ అరెస్టు చేసింది.


30 ఏళ్ల క్రితం చట్ట విరుద్ధంగా భూమిని పొందారన్న ఆరోపణలపై రెహమాన్‌ను పాక్ జాతీయ అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటెబులిటీ బ్యూరో (ఎన్ఐబీ) అదుపులోకి తీసుకుంది. 12 రోజులుగా ఆయన నిర్బంధంలోనే ఉన్నారు.


జంగ్ గ్రూప్ పాకిస్తాన్‌లో జియో టీవీ లాంటి ప్రముఖ చానెళ్లను, దినపత్రికలను నడిపిస్తోంది.


మీడియా స్వేచ్ఛ, రాజకీయ అసమ్మతిపై పాక్‌లో అణచివేత సాగుతోందనడానికి రెహమన్ అరెస్టు నిరద్శనమని పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తలు అంటున్నారు.


తనపై వచ్చిన ఆరోపణలను రెహమాన్ తోసిపుచ్చారు. శుక్రవారం ఆయన్ను ఎన్ఏ‌బీ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఆయనపై అభియోగాల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.