*తేది:26-08-2021*
*దిశ డిఐజి కార్యాలయం*
*మంగళగిరి*
*DISHA SOS కాల్ తో రెండు నిండు ప్రాణాలను కాపాడిన విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు.*
ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ తనను మోసంచేయడం తో సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేక గత్యంతరం లేని పరిస్థితిలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన కుమార్తెను పోలీసులు చేరదీసి ఆదుకోవాలని కోరుతూ అర్థరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ఓ మహిళ DISHA SOSకి సందేశాన్ని అందించింది.
DISHA SOS కు పంపిన సమాచారం నెంబరు ఆధారంగా మహిళ ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన *దిశ కంట్రోల్ రూం* సిబ్బంది హుటాహుటిన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారాన్ని చేరవేయడంతో సకాలంలో స్పందించిన సమీపంలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు కేవలం *10 నిమిషాల* వ్యవధిలోనే మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే గుర్తుతెలియని విషం సేవించి అపస్మారక స్థితిలో పడిఉన్న మహిళను గుర్తించిన పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలను నిలబెట్టారు. అంతేకాకుండా మహిళ తో పాటు ఉన్న ఐదు సంవత్సరాల బాలికను చేరదీసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
Thank You