*10-07-2021*
*గుంటూరు జిల్లా:*
*బ్రేకింగ్స్...*
వీర జవాన్ జశ్వంత్ రెడ్డికి నివాళులర్పించిన హోంమంత్రి మేకతోటి సుచరిత.
బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంలో సైనిక లాంఛనాలతో జరిగిన జశ్వంత్ అంత్యక్రియలకు హాజరయిన హోంమంత్రి.
జశ్వంత్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన హోంమంత్రి సుచరిత.
వీర జవాన్ జశ్వంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి సుచరిత.
అమర జవాన్ జశ్వంత్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్ ను అందజేసిన హోంమంత్రి.
అతి చిన్నవయస్సులో జశ్వంత్ మరణించడం చాలా బాధాకరమన్న హోంమంత్రి.
దేశ రక్షణ కోసం జశ్వంత్ రెడ్డి చేసిన త్యాగం మరువలేనిదన్న హోంమంత్రి సుచరిత.
దేశ సేవలో ప్రాణాలర్పించిన జశ్వంత్ కుటుంబానికి ప్రభుత్వం తరుపున ఎప్పుడూ అండగా ఉంటామన్న హోంమంత్రి.
హోంమంత్రి తో పాటు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని, జెసి దినేష్ కుమార్ లు పరామర్శించారు.
Thank You