సచివాలయం, జూన్ 22 : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మండలి సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ లో ఉన్న కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఈ నెల 30 వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు.
జారీచేసిన వారు : పబ్లిసిటీ సెల్, I&PR, సచివాలయం,
Thank You