*అమరావతి*
*కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్తో పాటు వైద్యశాఖలో నాడు–నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*అమరావతి:*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే... :*
రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేసిన సిబ్బందికి సీఎం అభినందనలు
గత రికార్డును అధిగమిస్తూ వ్యాక్సిన్లు ఇచ్చిన వారందరికీ అభినందనలు: సీఎం
వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఇచ్చే సమర్థత ఉందని నిరూపించారు:
మన దగ్గర మంచి యంత్రాంగం ఉంది:
ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయాల్లో సిబ్బంది
అలాగే మండలానికి రెండు పీహెచ్సీలు, అందులోని డాక్టర్లు
ఇలా గట్టి యంత్రాంగం మనకు ఉంది:
అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు మనకు అందుబాటులో ఉంటే.. అంతేస్థాయిలో వ్యాక్సిన్లు ఇవ్వగలిగే సామర్థ్యం మనకు ఉన్నాయి.
ఇంత కంటే మెరుగ్గా చేయగలం:
వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే మరో మెగా డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి
అధికారులతో సీఎం శ్రీ వైయస్.జగన్
రోజులో 20 నుంచి 25 లక్షల మందికి వాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, యంత్రాంగం మనకు ఉన్నాయన్న అధికారులు
*కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, నాడు–నేడు పనులపైనా సీఎం సమీక్ష*
– కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి.
– శరవేగంగా వీటి పనులు జరగాలి అధికారులకు సీఎం ఆదేశం.
– పనుల జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
– కొత్త మెడికల్కాలేజీల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
*అస్పత్రుల నిర్వహణ–అత్యుత్తమ ప్రమాణాలు*
ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై సీఎం ఆదేశాలమేరకు అధ్యయనం చేసిన అధికారులు
దీనికి సంబంధించిన వివరాలను సీఎంకు తెలిపిన అధికారులు
బిల్డింగ్, సర్వీసులు, నాన్ బిల్డింగ్ సర్వీసులపై అధ్యయన వివరాలు తెలిపిన అధికారులు
ఆస్పత్రి ఆవరణకూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలని సీఎం ఆదేశం
ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి పటిష్టమైన ఎస్ఓపీలను తయారుచేయాలి
మనం పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతోకాదు, కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీపడాలి.
ఎక్కడా కూడా ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదు.
అనుకోని ప్రమాదాలు వచ్చే సమయంలో రోగులను సురక్షితంగా ఖాళీచేయించే ఎమర్జెన్సీ ప్లాన్స్ కూడా సమర్థవంతంగా ఉండాలి
కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరించే ప్రోటోకాల్స్పై అధ్యయనం చేయాలి
అన్ని అంశాలనూ స్టడీ చేశాక సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వండి
అధికారులకు సీఎం ఆదేశం
*కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలతో పాటు వాక్సినేషన్పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు*
– తూ.గో. జిల్లా తప్ప అన్నిజిల్లాల్లో తగ్గిన పాజిటివిటీ రేటు
– మరింత తగ్గుముఖం పట్టిన యాక్టివ్ కేసులు
– 63,068కు తగ్గిన యాక్టివ్ కేసులు
–పాజిటివిటీ రేటు 5.65 శాతం
– 95.93శాతానికి చేరిన రికవరీ రేటు
– పొరుగురాష్ట్రాల్లో కోవిడ్ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం.
రాష్ట్రంలో అందుబాటులో 2655 ఐసియూ బెడ్లు
అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్లు 13,824
– మే 17న అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్లు కేవలం 433
– ఆరోగ్యశ్రీ కవరేజీ కింద ఆస్పత్రుల్లో 91.48 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స
– 104 కాల్ సెంటర్క్ కోవిడ్ కాలంలో గరిష్టంగా వచ్చిన కాల్స్ 19,715
ప్రస్తుతం 104కు వచ్చిన కాల్స్ 1506
– కోవిడ్ కేర్ సెంటర్లలో భర్తీ అయిన బెడ్లు 7,056
*బ్లాక్ ఫంగస్*
– బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు 2772
– వీరిలో 922 మందికి సర్జరీలు
– 1232 మంది డిశ్చార్జి
212 మంది మృతి
– మిగిలిన వారికి ఆస్పత్రిలో చికిత్స
*వాక్సినేషన్:*
వాక్సినేషన్పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
– రాష్ట్రంలో 1,37,42,417 డోసుల వ్యాక్సినేషన్
– 82,77,225 మందికి మొదటి డోసు, 27,32,596 మందికి రెండు డోసుల వాక్సిన్
– మొత్తంగా వ్యాక్సిన్లు అందుకున్న ప్రజలు 1,10,09,821
– ఐదేళ్లలోపు వయస్సున్న పిల్లల తల్లుల్లో 10,29,266 మందికి వ్యాక్సినేషన్
– విదేశాలకు వెళ్లనున్న 11,158 మందికి మొదటి డోసు
– జూన్ 20న నిర్వహించిన మెగా డ్రైవ్లో 13,72,481 మందికి వ్యాక్సినేషన్
ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి(కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జ్ ఎ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Thank You