No title


 *విశాఖ రైల్వే జోన్ రావడం లేదని పత్రికలలో వచ్చిన* *వార్తలను ఖండిస్తూ విశాఖకు రైల్వే జోన్ రావడం తధ్యమని ధృవీకరించిన బిజెపి* *ఎంపి జివిఎల్* 


ఈరోజు ఉదయం విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యలయంలో బిజెపి ఎంపి శ్రీ జివిఎల్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ రాడం తధ్యమని, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, గత పార్లమెంటు సమావేశాల్లో కూడా తను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖమంత్రి తన సమాధానం ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారని తెలియచేశారు.. ఈరోజు ఉదయం కూడా తాను కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ గారితో మాట్లాడానని ఆయన కూడా పత్రికలలో వచ్చిన వార్తలలో నిజం లేదని ,రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదని,కాబట్టి ప్రజలు విశాఖ రైల్వే జోన్ పై వచ్చిన పుకార్లను నమ్మవద్దని ఎంపి జివిఎల్ కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.