రాజ్ భవన్ - విజయవాడ
*అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన జగ్జీవన్ రామ్*
*ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్*
విజయవాడ : సమాజంలోని పేద, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్ రామ్ ఆందించిన సేవలు ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దూరదృష్టితో దేశ రాజకీయాలకు దిశానిర్ధేశం చేసారని, అభివృద్ధికి బాటలు వేసారని వివరించారు. “బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి పురస్కరించుకుని గవర్నర్ సందేశం అందించారు. జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నానన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధునిగా బాబూ జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. సమర్థుడైన పరిపాలకునిగా దేశానికి నిష్కళంకమైన సేవలను అందించారన్నారు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన బాబూ జగ్జీవన్ రామ్ నిజమైన ప్రజాస్వామికవాది అని గవర్నర్ అభినందించారు. బాబూజీ 35 ఏళ్ల పాటు కేబినెట్ మంత్రిగా దేశానికి సేవలు అందించి, అనేక కీలక శాఖలను నిర్వహించారని, దేశంలో హరిత విప్లవం వంటి మార్గనిర్దేశిత సంస్కరణలను ప్రవేశ పెట్టారని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ గుర్తు చేసారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
Thank You