పత్రికా ప్రకటన
*భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం*
విశాఖపట్నం, జూన్ 26 నగరంలో పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కు విశాఖ విమానాశ్రయంలో శనివారం ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఉదయం గం. 11: 45 ని. లకు విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి కి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ ఏ.బి. సింగ్, విశాఖ మేయరు జి.వి.హరి కుమారి, విశాఖ పోర్టు చైర్మన్ కె. రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎమ్ఎల్సీ పి.వి.మాధవ్,
తదితరులు స్వాగతం పలికారు. తరువాత ఆయన నేరుగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు.
Thank You